Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తను బుగ్గగిల్లిన మేనల్లుడు.. ఫిర్యాదు చేసినందుకు అలా చేశారు...

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (12:37 IST)
మామ ఇంట్లో లేని సమయంలో అత్త బుగ్గను మేనల్లుడు గిల్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గ్రామ పంచాయతీ పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలికే గుండు కొట్టించారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రంలోని కోడెర్మా జిల్లా దంగోడి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈమె ఇంటికి వరుసకు మేనల్లుడయ్యే 22 యేళ్ల యువకుడు రోజూ వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఈ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను బుగ్గ గిల్లడంతో పాటు.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గత మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. ఆ గ్రామ మహిళా పంచాయతీ సభ్యులను కలిసి బాధిత మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఈ సంబంధం కొనసాగించాల్సిందిగా తనను వేధిస్తోందంటూ ఆరోపించాడు. దీంతో వాళ్లంతా ఆమె ఇంటికి చేరుకుని బయటికి లాక్కొచ్చి అర్థనగ్నంగా మార్చి తీవ్రంగా దాడి చేశారు. 
 
తప్పు చేశావంటూ ఆమె జట్టు కత్తిరించి  పంచాయతీ వద్దకు ఈడ్చుకువచ్చారు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో 11 మంది వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments