Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుని భగవానుని కోసం నర్మదా నదిలో దూకిన మహిళ

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:57 IST)
ఆ కాలంలో శ్రీకృష్ణుని కోసం వేలమంది గోపికలు పరితపించి పోయారని విన్నాం. అయితే ఈ కాలంలో కూడా అలాంటి వారు అడపాదడపా దర్శనమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్వాతి గౌర్ (32) శ్రీకృష్ణుని కలుసుకునేందుకు తపించిపోయిన మీరాబాయిని స్ఫూర్తిగా తీసుకుని నర్మద నదిలో దూకింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని మంగ్వారీ ప్రాంతానికి చెందిన స్వాతి వివాహితురాలు. ఎప్పుడూ శ్రీకృష్ణ నామ స్మరణలోనే ఉండేది. ఇటీవల ఆమె తన భర్త భూపేంద్రతో కలిసి బైక్‌పై షాహ్‌గంజ్ వెళుతుండగా బైక్ మీద కూర్చున్న ఆమె కృష్ణ భక్తిలో లీనమైంది. బైక్ నర్మద బ్రిడ్జి మీదకు చేరుకోగానే భర్తతో తన చెప్పు కింద పడిపోయిందని చెప్పగా భూపేంద్ర వెంటనే బైక్ ఆపాడు. తర్వాత కిందకు దిగిన స్వాతి గౌర్ నర్మదా నదిలోకి దూకేసింది. 
 
అయితే అదృష్టవశాత్తూ నదిలో నరేంద్ర కెవట్, ప్రశాంత్ కహార్ అనే ఇద్దరు జాలరులు ఉండటంతో ఆమెను ప్రాణాలతో రక్షించారు. పోలీసుల విచారణలో స్వాతి తాను శ్రీకృష్ణ భగవానుని కలుసుకునేందుకు నర్మదలో దూకినట్టు తెలిపింది. నర్మద నదిని చూడగానే తనకు శ్రీకృష్ణుని దర్శనం కలిగినట్లయ్యిందని పేర్కొంది. కాగా ఆ జాలరులు ఆమెను రక్షించి, బోటులో కూర్చోబెట్టిన సమయంలోనూ ఆమె శ్రీకృష్ణ జపం చేస్తూ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments