Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఖా'కీచక' పర్వం : ఐపీఎస్ మహిళా అధికారికి వేధింపులు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:38 IST)
దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో మొదటిస్థానంలో ఉండే తమిళనాడు రాష్ట్రంలో ఓ ఐపీఎస్ స్థాయి లేడీ ఆఫీసరుకు లైంగిక వేధింపులు తప్పలేదు. డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఆమెను లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీంతో విచారణకు ఓ కమిటీని రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఆమె ఆరోపణలపై సదరు ఉన్నతాధికారి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
 
ఇదిలావుంటే, ప్రధాని మోడీ చెన్నై పర్యటన సమయంలో ఆ అధికారిని దూరం పెట్టారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఆ బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అహంకారానికి ఇది నిదర్శనమని, ఇలాంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని మెచ్చుకుంటున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం