Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా కలిపిన మ్యాగీ తిని ముంబై మహిళ మృతి

Webdunia
శనివారం, 30 జులై 2022 (23:03 IST)
ముంబైకి చెందిన ఓ మహిళ మ్యాగీ న్యూడుల్స్‌కి టమోటా కలిపి టేస్ట్ చేసింది. అంతే ప్రాణాలు కోల్పోయింది. ఇదేంటి మ్యాగీలో టమోటా కలిపి తింటే చనిపోతారా అనుకునేరు. 
 
అసలు విషయం ఏంటంటే మృతురాలు ఎలుకను చంపేందుకు టోమాటోలో విషం పెట్టింది. ఈ విషయాన్ని మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసి వండింది. ఇది తిని చనిపోయింది.
 
ముంబైకి చెందిన 27 ఏళ్ల రేఖ అనే మహిళ.. మ్యాగీని తయారు చేస్తుండగా, ఎలుకలు విషం పెట్టిన టొమాటోను పొరపాటున మ్యాగీలో వేసి వండింది. ఈ ఘటన ముంబైలోని మలాడ్ లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
మరుసటి రోజు మ్యాగీ న్యూడిల్స్ తయారు చేసే క్రమంలో.. టీవీ చూస్తూ ఎలుకల విషం పెట్టిన సంగతి మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసింది. దీంతో మ్యాగీని తిన్న సదరు మహిళకు కొన్ని గంటల్లోనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. 
 
ఆమె భర్త, బావ సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ప్రమాదవశాత్తు విషం కలిసిన టొమాటోను మ్యాగీలో కలపడం వల్లే మరణించిందని.. మాల్వాని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments