Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో కారులో వెళ్లిన రేష్మా అనుమానాస్పద మృతి?

Webdunia
శనివారం, 18 మే 2019 (09:28 IST)
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా నేత అనుమానాస్పదంగా చనిపోయారు. పక్కింటి వ్యక్తితో కలిసి కారులో వెళ్లి ఆమె శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేష్మా పడెకనురా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళ నేతగా ఉన్నారు. ఆమె మృతదేహం కొల్హార్‌కు సమీపంలో గల కృష్ణానదిలోని నీటిపై తేలుతూ కనిపించింది. 
 
ఇదే విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేష్మా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
శుక్రవారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో ఆమె బయటకు వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె శవమై నదిలో తేలింది. కాగా, 2013లో జేడీఎస్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments