Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత కట్నం ఇవ్వలేదనీ.. కోడలికి చేతిగోళ్లు, జుట్టును కత్తిరించిన అత్తింటివారు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:20 IST)
వరకట్న వేధింపులకు అనేక మంది మహిళలు బలైపోతున్నారు. మరికొంతమంది మహిళలు చిత్ర హింసలకు గురవుతున్నారు. తాజాగా ఓ వివాహితను అత్తింటివారు పలురకాలుగా హింసకు గురిచేశారు. చేతిగోళ్లతో పాటు జట్టును కత్తిరించి, చావబాదారు. దీంతో ఆ మహిళ అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణ బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన 22 యేళ్ళ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.2 లక్షలతో పాటు బైక్‌ కూడా కొనివ్వాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి భర్తతో పాటు.. అత్తమామలు భార్యను వేధించసాగారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టారు. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళ ప్రాధమిక చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... భర్తతో పాటు.. అత్తమామలను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments