Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:47 IST)
మానవ జీవింలో సంపాదించడం ఒక ఎత్తైతే, సమాజం మేలు కోసం ఆ సంపాదనను దాతృత్వ సేవకు వినియోగించడం మరో ఎత్తు. ఈ కోవలో చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజిమ్ ప్రేమ్‌జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. తాజా గణాంకాల ప్రకారం కూడా అదే చెబుతున్నారు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజిమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు.
 
ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు. అజిమ్ ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాను సమాజ సేవ కోసం అర్పించారు. ప్రస్తుతం ఆ వాటా విలువ రూ.52,750 కోట్లు. కాగా ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండో స్థానంలో హెచ్‌సీ‌ఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంతా గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉన్నారు.
 
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్న వయస్సు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ ఈ జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments