Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:47 IST)
మానవ జీవింలో సంపాదించడం ఒక ఎత్తైతే, సమాజం మేలు కోసం ఆ సంపాదనను దాతృత్వ సేవకు వినియోగించడం మరో ఎత్తు. ఈ కోవలో చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజిమ్ ప్రేమ్‌జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. తాజా గణాంకాల ప్రకారం కూడా అదే చెబుతున్నారు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజిమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు.
 
ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు. అజిమ్ ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాను సమాజ సేవ కోసం అర్పించారు. ప్రస్తుతం ఆ వాటా విలువ రూ.52,750 కోట్లు. కాగా ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండో స్థానంలో హెచ్‌సీ‌ఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంతా గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉన్నారు.
 
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్న వయస్సు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ ఈ జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments