Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:47 IST)
మానవ జీవింలో సంపాదించడం ఒక ఎత్తైతే, సమాజం మేలు కోసం ఆ సంపాదనను దాతృత్వ సేవకు వినియోగించడం మరో ఎత్తు. ఈ కోవలో చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజిమ్ ప్రేమ్‌జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. తాజా గణాంకాల ప్రకారం కూడా అదే చెబుతున్నారు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజిమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు.
 
ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు. అజిమ్ ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాను సమాజ సేవ కోసం అర్పించారు. ప్రస్తుతం ఆ వాటా విలువ రూ.52,750 కోట్లు. కాగా ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండో స్థానంలో హెచ్‌సీ‌ఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంతా గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉన్నారు.
 
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్న వయస్సు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ ఈ జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments