Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల హామీగా కరోనా : తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటన

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (19:25 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారి నుంచి తమ ప్రజలను రక్షించుకునేందుకు పలు దేశాలు విస్తృతంగా టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ వ్యాక్సిన్ల తయారీలో వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయి. 
 
ఈ వ్యాక్సిన్లు ఈ యేడాది డిసెంబరు నాటికి కానీ, లేదంటే వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి వ్యాక్సిన్ ప్రస్తుతం పరీక్షల దశలోనే ఉన్నప్పటికీ ఇప్పుడిది ఎన్నికల హామీగా మారింది.
 
రాజకీయ నేతలు ఇప్పుడు ఈ టీకా గురించి ప్రజలకు ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తొలిసారిగా ఈ అంశాన్ని తలకెత్తుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ప్రకటించింది. ఇందులో తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది. 
 
బీజేపీ అలా ప్రకటించిందో.. లేదో.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి కూడా ఇదే పల్లవి ఎత్తుకున్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న టీకాలు మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఒకసారి టీకా అందుబాటులోకి రాగానే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పళనిస్వామి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments