Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 55,839 కేసులు నమోదు.. 702 మంది మృతి

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 55,839 కేసులు నమోదు.. 702 మంది మృతి
, గురువారం, 22 అక్టోబరు 2020 (10:51 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే వుంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 77 లక్షల 06 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,839 కేసులు నమోదు కాగా, 702 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 79,415 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
అలాగే దేశంలో మొత్తం 77,06,946 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,15,812 ఉండగా, 68,74,518 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,16,616 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 89.20 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.29 శాతంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలువు ఉంటుందో.. ఊడుతుందో.... తీవ్ర ఒత్తిడిలో వేతనజీవులు