Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 13న చంపేస్తాం.. చేతనైతే రక్షించుకో : రాజస్థాన్ జడ్జికి బెదిరింపులు

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (12:47 IST)
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జడ్జిని మైనింగ్ మాఫియా ఆటోతో ఢీకొట్టించి హత్య చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇపుడు రాజస్థాన్ కోర్టు జడ్జికి బెదిరింపు లేఖ వచ్చింది. 
 
'మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబరు 13న హత్య చేస్తున్నాం. మీ ఇంటిని బాంబులతో పేల్చేద్దామనుకున్నాను కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల నాకు హాని లేదు కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నా. తుపాకితో కాల్చిగాని, విషమిచ్చి కానీ, వాహనంతో ఢీకొట్టి కానీ.. ఏదో రకంగా మిమ్మల్ని చంపేస్తా. కోర్టులో నిందితుడికి మీరు ఎలా అయితే అవకాశం ఇస్తారో, మేం కూడా రక్షించుకునేందుకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ విషయమై పోలీసులకూ సమాచారం ఇచ్చాం. చేతనైతే రక్షించుకోండి' అంటూ రాజస్థాన్‌లోని బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు అజ్ఞాత వ్యక్తి ఒకరు లేఖ రాశాడు.
 
హిందీలో రాసిన ఈ లేఖలో జడ్జికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments