Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి గర్భవతిని చేశాడు.. పదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.. ఏమైందంటే?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (12:44 IST)
ప్రేమించిన వ్యక్తి చేతిలో గర్భవతి అయ్యింది. అంతే ప్రేమికుడు పారిపోయాడు. పదేళ్ల తర్వాత ఊరిలో అడుగుపెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీసింది.. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. దానికి అతడు నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
గరియాబంద్‌కు చెందిన భరత్ 2010లో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా 2011లో ఆ యువతి గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న భరత్ ఊరి నుంచి పరారయ్యాడు. ఏకంగా పదేళ్ల పాటు వేరే ఊర్లో ఉండిపోయాడు. 2012లో సదరు యువతి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 2013లో ఆ చిన్నారి మరణించింది.
 
వేరే యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భరత్ దాదాపు పదేళ్ల తర్వాత ఈ నెల 10న గరియాబంద్‌లో అడుగు పెట్టాడు. భరత్ వచ్చినట్టు తెలుసుకున్న బాధిత యువతి అతడి ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. 
 
అందుకు భరత్ నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. 2010లో తనపై అత్యాచారానికి పాల్పడిన భరత్ తనను గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం