Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (20:31 IST)
Marriage
ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న వివాహం జరిగింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. 
 
అయితే శోభనం గదిలోకి వెళ్లగానే నవ వరుడికి షాక్ తప్పలేదు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నవవధువు చెప్పింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు తన ప్రియుడితోనే సంసారం చేస్తానని తెగేసి చెప్పేసింది. భర్త ముందే వీడియో కాల్ ద్వారా ప్రియుడితో మాట్లాడింది. దీంతో వరుడు ఏం చేయాలో తెలియక శోభనం గది నుంచి బయటికి వచ్చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు. 
 
ఫిబ్రవరి 12 భార్యను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లాడు. కానీ నవ వధువు కుటుంబీకులు కలైయరసన్ ఆమెతోనే సంసారం చేయాలని చెప్పి పంపారు. ఇంతటితో ఈ కథ ముగిసిందనుకుంటే.. మూడు రోజుల తర్వాత భర్తకు జ్యూస్‌లో భార్య విషం కలిపి పెట్టింది. 
 
వెంటనే కలైయరసన్ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. నవ వధువుపై కలైయరసన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments