Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (20:31 IST)
Marriage
ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న వివాహం జరిగింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. 
 
అయితే శోభనం గదిలోకి వెళ్లగానే నవ వరుడికి షాక్ తప్పలేదు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నవవధువు చెప్పింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు తన ప్రియుడితోనే సంసారం చేస్తానని తెగేసి చెప్పేసింది. భర్త ముందే వీడియో కాల్ ద్వారా ప్రియుడితో మాట్లాడింది. దీంతో వరుడు ఏం చేయాలో తెలియక శోభనం గది నుంచి బయటికి వచ్చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు. 
 
ఫిబ్రవరి 12 భార్యను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లాడు. కానీ నవ వధువు కుటుంబీకులు కలైయరసన్ ఆమెతోనే సంసారం చేయాలని చెప్పి పంపారు. ఇంతటితో ఈ కథ ముగిసిందనుకుంటే.. మూడు రోజుల తర్వాత భర్తకు జ్యూస్‌లో భార్య విషం కలిపి పెట్టింది. 
 
వెంటనే కలైయరసన్ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. నవ వధువుపై కలైయరసన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments