ఎన్డీ.తివారీ కుమారుడి హత్య కేసులో భార్యే ముద్దాయి

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:29 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ముఖ్యమంత్రి ఎన్.డి.తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆయన భార్యే అపూర్వనే ప్రధాన నిందితురాలని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆమె పోలీసుసలకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
ఇటీవల రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈనెల 16వ తేదీన ఆయన ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టుతో రోహిత్‌ హత్యకు గురైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా రోహిత్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని 8 గంటల పాటు ప్రశ్నించారు. అపూర్వ, ఆమె తల్లిదండ్రులు తమ ప్రాపర్టీపై కన్నేశారని, తన కొడుకుని వారే హత్య చేసి ఉండవచ్చని ఆదివారం రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ హత్య కేసులో భార్య పాత్ర ఉన్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments