Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నలుపు రంగులో ఉన్నాడని పెట్రోల్‌తో తగలబెట్టేసింది!

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అతనిపై పెట్రోల్ పోసి తగలెట్టేసింది. ఈ అమానుష ఘటన గత సోమవారం రోజున జరిగింది, అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికి 5 నెలల పాప కూడా ఉంది. 
 
చూడటానికి అందంగా ఉండే ప్రేమ్‌శ్రీ తన భర్త నల్లగా ఉన్నాడంటూ బాధపడేది. ఎప్పుడూ అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవకు దిగేది. ఇది సాధారణ విషయంగానే కుటుంబసభ్యులు భావించారు. అయితే ప్రేమ్‌శ్రీ ఎవరూ ఊహించని ఘాతుకానికి పాల్పడింది. భర్త నలుపు రంగులో ఉండటాన్ని తట్టుకోలేని ప్రేమ్‌శ్రీ నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. 
 
తీవ్ర గాయాలపాలైన సత్యవీర్‌సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన సత్యవీర్‌సింగ్ సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రేమ్‌శ్రీ కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments