Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగు, గంధం పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

పెరుగు, గంధం పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:56 IST)
ఎండ వేడి కారణంగా చర్మం, శిరోజాలు సౌందర్యం తగ్గుతుంది. నవనవలాడే చర్మం రంగు మారి ముడతలు పడుతుంది. మెరిసే కురులు బిరుసెక్కి రాలిపోతూ ఉంటాయి. ఈ సౌందర్య సమస్యలకు చెక్ పెట్టాలంటే వేసవిలో కొన్ని బ్యూటీ చిట్కాలు పాటించాలని చెప్తున్నారు. 
 
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. తరచు చర్మం పొడిబారుతుంటే.. పెరుగులో కొద్దిగా గంధం పొడి, టమోటా రసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంటపాటు అలానే ఉండాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫేసియల్ బ్లాటింగ్ పేపర్, సన్‌స్క్రీన్ లోషన్, వెట్‌వైప్స్, లిప్‌బామ్‌లో పర్సులో వెంట తీసుకెళ్లాలి. వేడికి చర్మం జిడ్డుగా తయారైతే బ్లాటింగ్ పేపర్ అద్దుకోవాలి. ప్రతి నాలుగు గంటలకోసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. అలానే పెదవులు పొడిబారకుండా లిప్‌బామ్ అప్లై చేయాలి. 
 
ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే.. మైల్డ్ క్లీన్సర్‌తో రోజుకు కనీసం 4 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మృతకణాలు, సన్‌ట్యాన్ తొలగిపోతాయి. ఈ ఎక్స్‌ఫాలియేట్ వలన చర్మం తాజాగా తయారవుతుంది.    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతచిగురుతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్