Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెళ్లాన్ని నా దగ్గరకు పంపవా? ఐతే నువ్వు చావాల్సిందే... అత్తను హత్య చేసిన అల్లుడు

Webdunia
సోమవారం, 27 మే 2019 (18:27 IST)
మనుషుల్లో ఓర్పు క్రమంగా తగ్గిపోతోంది. చిన్నచిన్న సమస్యలనే సుడిగుండాలుగా మార్చేసుకుంటున్నారు. మొండితనం ఎక్కువవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవతలి వ్యక్తిపైన విపరీతమైన ద్వేషం పెంచుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణం. అందువల్ల ఈమధ్య కాలంలో హత్యలు ఇతర దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడులో తన కుమార్తెను వేధిస్తున్నందుకు అల్లుడి వద్దకు పంపను అన్నందుకు ఆమెను హత్య చేశాడు అల్లుడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా వండలూరు సమీపంలో సతీష్ కుమార్, సుష్మిత వుంటున్నారు. పెళ్లయి ఏడాది దాటింది. ఇటీవలి ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీటి కారణంగా సతీష్ ఓ రోజు సుస్మితపై చేయిచేసుకున్నాడు. దీనితో సుస్మిత తల్లి విషయం తెలుసుకుని కుమార్తెను తమ ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత కొన్నిరోజులకి సతీష్ అత్తింటికి వెళ్లాడు. తన భార్యను తనతో పంపాలనీ, కాపురం చేసుకుంటానని అడిగాడు. దాంతో సుస్మిత తల్లి అందుకు ససేమిరా అన్నది. 
 
ఆమె అలా అనేసరికి సతీష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అర్థరాత్రి దాటాక అంతా నిద్రిస్తున్న సమయంలో పదునైన కత్తి తీసుకుని నిద్రిస్తున్న అత్త గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తన తల్లి రక్తపు మడుగులో పడి వుండటాన్ని చూసిన సుస్మిత విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments