Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (18:16 IST)
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టు అయిన హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఇపుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈమెకు అనేక మంది లింకులు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలోని పూరీకి చెందిన ప్రియాంక సేనాపతితో జ్యోతికి సంబంధం ఉన్నట్టు తేలింది. ఇపుడు తాజాగా యాత్రి డాక్టరుగా గుర్తింపు పొందిన డాక్టర్ నవంకుర్ చౌదరి పేరు బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై చిక్కుల్లో పడ్డారు. 
 
ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ, తనపై కుట్రపూరితంగా అసత్య ప్రచారం సాగుతుందన్నారు. జ్యోతికి తనకు కేవలం పరిచయం మాత్రమే ఉందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జ్యోతి మల్హోత్రా నాకు అభిమానిగా మాత్రమే పరిచయమన్నారు. అంతకుముందు ఆమె నాకు వ్యక్తిగతంగా తెలియదన్నారు. మేమిద్దంరం కేవలం యూట్యూబ్ గురించి కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకున్నట్టు చెప్పారు. 
 
తాను పాకిస్థాన్‌కు కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లానని, అది కూడా ప్రపంచంలోని 197 దేశాలు పర్యటించాలనే నా లక్ష్యంలో భాగంగానే జరిగిందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను ఏ దర్యాప్తులోనూ లేనని, ఒకవేళ అవసరమైతే దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments