Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (17:02 IST)
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 2015లో సదరు శ్రీలంక జాతీయుడుని భారత్‌లో అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద 2018లో ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, పదేళ్ళ శిక్ష విధించింది. అయితే, 2022లో మద్రాస్ హైకోర్టు ఈ శిక్షను ఏడేళ్ల కాలానికి తగ్గించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని అప్పటివరకు శరణార్థ శిబిరంలో ఉండాలని ఆదేశించింది. దీంతో సదరు శ్రీలంక తమిళ జాతీయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 
 
తాను వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తనకు ప్రాణహాని ఉందని, పైగా, తన భార్యాపిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని తన పిటిషన్‍లో పేర్కొన్నారు. శిక్ష పూర్తయినా దాదాపు మూడేళ్లుగా నిర్బంధంలోనే ఉంచారని, దేశం నుంచి పంపించే ప్రక్రియను కూడా ప్రారంభించలేదని పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... భారత్ ధర్మసత్రం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పైగా, ఆర్టికల్ 19 హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది అని సూటిగా ప్రశ్నించింది. 
 
తాను శరణార్ధినని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పదేపదే విన్నవించినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు. భారతదేశం మీ కోసం ఎదురుచూడటం లేదు. మీరు కోరుకుంటే మరో దేశానికి వెళ్లవచ్చు అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. చట్టప్రకారం నిర్ధేశించిన ప్రక్రియను పూర్తయిన తర్వాత పిటిషనర్‌ను శ్రీలంకకు పంపించాలని అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments