Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏవీ?: మోడీపై రాహుల్ ఆగ్రహం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:06 IST)
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. అనేక దేశాలతో సంబంధాలను మోడీ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాలతో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ పటిష్ట సంబంధాలను కొనసాగిస్తే…దానిని మోడీ ఇప్పుడు విచ్ఛిన్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మిత్రులు లేకుండా ఇరుగుపొరుగుతో జీవించడం అత్యంత ప్రమాదకరమని రాహుల్‌ పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా మోడీ సర్కారుపై రాహుల్‌ ధ్వజమెత్తుతూ…బంగ్లాదేశ్‌తో భారత్‌ సంబంధాలు బలహీనపడగా చైనాతో సంబంధాలు పటిష్టవంతమయ్యాయని ఓ ఆర్థికవేత్త రాసిన వ్యాసాన్ని రాహుల్‌ ట్వీట్‌కు జత చేశారు.

ఇరుగుపొరుగుతో మైత్రీబంధం లేకపోతే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలు బలహీనపడ్డాయని ఆక్షేపించింది.

ఈ ఆరోపణలను మోడీ సర్కారు తోసిపుచ్చింది. చాలా దేశాలతో భారత్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని, ప్రపంచంలో భారత్‌ శక్తివంతంగా తయారవుతుందని కేంద్రం చెప్పుకుంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments