Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.14 వేలు ఖర్చు చేసి 5 ఎలుకలు చంపుతున్న రైల్వే శాఖ!

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:55 IST)
ప్రపంచంలోని రెండో పెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. అలాంటి రైళ్ళలో ప్రయాణికుల బోగీల్లో మాత్రం దుర్వాసన వస్తుంటుంది. దీనికితోడు ఎలుకలు రాజ్యమేలుతుంటాయి. ఈ ఎలుకల బెడదకు పలు సందర్భాల్లో రైళ్ళను కొన్నిగంటల పాటు నిలిపివేసిన సందర్భాలు లేకపోలేదు. 
 
అంతేకాకుండా, రైళ్లు పట్టాలపై సాఫీగా పరుగులు పెట్టాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. వీటిలో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. ఈ సిగ్నల్ కోసం వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ.14 వేలు ఖర్చు చేస్తూ, కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తేలింది. ఆర్టీఐ నుంచి వచ్చిన ప్రశ్నకు పశ్చిమరైల్వే ఈ విధమైన సమాధానమిచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments