Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సీరీస్ పిచ్చి , 75 మంది ప్రాణాలను కాపాడింది, ఎక్కడ, ఎలా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:43 IST)
సాధారణంగా కొందరు సినిమాలపై మోజు పెంచుకుంటూ అందులోనే నిమగ్నమై పోతుంటారు. దీనికోసం తమ సమయాన్ని లెక్క పెట్టకుండా కాలయాపన చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వెబ్ సీరీస్ పైన పెంచుకున్న మోజు చివరికి 75 మంది ప్రాణాలను రక్షించింది. అసలు వెబ్ సీరీస్ వల్ల ప్రాణాలు కాపాడడం ఎలా అని కొందరు తికమకలవుతారు కానీ ఇది నిజమని నిరూపించాడు ఓ యువకుడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్రలో దొంబివిలి, కాపర్ ఏరియాకు చెందిన కునాల్ అనే యువకుడికి వెబ్ సీరీస్ అంటే పిచ్చి. రాత్రింబవళ్లు లెక్క చెయ్యకుండా చూస్తుంటాడు. అతడు బుధవారం రాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు చూస్తున్నాడు. ఈ క్రమంలో తానుండే రెండంతస్థుల భవనంలో ఓ భాగం కూలిపోవడం గమనించాడు.
 
దీంతో అప్రమత్తమై ఆ భవనంలో నిద్రిస్తున్న 75 మందిని లేపి అప్రమత్తం చేశాడు. అందరూ భయపడి పరుగులు పెడుతూ బయటికి వచ్చేశారు. చూస్తున్న సమయంలోనే ఆ భవనం కుప్ప కూలిపోయింది. కానీ శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని ఖాళీ చెయ్యమని అధికారులు తొమ్మిది నెలలకు ముందే నోటీసులు జారీ చేశారు. 75 మంది ప్రాణాలను రక్షించిన కునాల్‌ను అందరూ మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments