Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిన చక్కి బ్రిడ్జి - హిమాచల్ ప్రదేశ్‌లో 14 మంది మృతి

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:44 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలమైపోతోంది. ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జి శనివారం కూలిపోయింది. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కలుపుతుంది. 
 
అలాగే, భారీ వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 14 మంది వరకు చనిపోయినట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. చంబా జిల్లాలో వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మండి జిల్లాలోని బాగీ సుల్లాలో ఓ అమ్మాయి మృతదేహాన్ని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అమ్మయికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయినట్టు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
క్లౌడ్‌బ‌స్ట్ కావ‌డంతో బాగీ నుంచి ఓల్డ్ క‌టోలా ప్రాంతంలో ఉన్న ఇండ్ల‌కు చెందిన కుటుంబాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల మండి జిల్లాలో రోడ్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments