Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

అవన్నీ తప్పుడు వార్తలు.. ఖండిస్తున్నా : రాహుల్ ద్రావిడ్

Advertiesment
Rahul Dravid
, బుధవారం, 11 మే 2022 (10:22 IST)
తాను హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరుగనున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమీిటీ సమావేశం జరుగనుంది. ఇందులో రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొననున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
వీటిపై ద్రావిడ్ స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదు. తాను ఆ కార్యక్రమానికి హాజరుకావడం లేదని స్పష్టంచేస్తున్నా. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు.
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. గత 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 44, కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు రాగా, ఇతరులకు మూడు సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2022 : ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్