Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
covid
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతి చెందగా, 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 1862 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 0.84 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయనీ రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మరణాల సంఖ్య 1.21 శాతంగా ఉందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతులు.. ఆరు పేపర్లు.. 900 మార్కులు