Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ.. రోడ్ షో, నామినేషన్ దాఖలు

సెల్వి
బుధవారం, 23 అక్టోబరు 2024 (10:12 IST)
Wayanad
వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రియాంక మంగళవారం రాత్రి తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వయనాడుకు వచ్చారు. 
 
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడుకు చేరుకున్నారు.  వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సీనియర్ నేతలు కూడా ప్రియాంకకు మద్దతుగా హాజరుకానున్నారు. 
 
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రియాంక, ఆమె సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కల్పేటలో ఉదయం 11 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు, రోడ్‌షో తర్వాత, ఆమె బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత, ఆమె తన నామినేషన్ దాఖలు చేస్తారు.  
 
వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ, రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments