Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయనాడ్: 23న ప్రియాంకా నామినేషన్ దాఖలు.. ఖుష్బూతో పోటీ?

Priyanka Gandhi

సెల్వి

, శనివారం, 19 అక్టోబరు 2024 (20:34 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే వారం వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్టోబర్ 23న ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమెతో పాటు ప్రతిపక్ష నేత, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉంది. 
 
కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృత ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్‌తో పాటు, మలప్పురం జిల్లా ప్రాంతాల్లో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న ముస్లిం లీగ్, ఈసారి ప్రియాంకకు రికార్డు విజయాన్ని అందిస్తామని పేర్కొంది. 
 
5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించాలని యుడిఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. మునుపటి ఎన్నికల్లో, రాహుల్ గాంధీ ఓట్ల శాతం 2019 నుండి 5.25 శాతం తగ్గింది. అయితే, 2019లో వయనాడ్ నుండి తన మొదటి పోటీలో, రాహుల్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. 431,770 ఓట్ల తేడాతో సీటును గెలుచుకున్నాడు. కాగా, శనివారం వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరికి మద్దతుగా భారీ రోడ్‌షో జరిగింది.
 
ఇకపోతే.. ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్‌ను పోటీకి దింపే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ఎన్నికల వేళ ఇలాంటి పుకార్లు మామూలేనని అన్నారు. ఇది పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీ‌పై పోటీ చేయడానికి సిద్ధమేనని ఖుష్భూ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో అంతస్థు నుంచి కిందపడి గృహిణి మృతి.. ఎలా జరిగిందంటే?