Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం.. యోగా చేశాడు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (10:35 IST)
Kerala Man
రోడ్లు అధ్వానంగా వుండటంతో కేరళ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఈ మేరకు హంజా పొరాలి అనే కేరళ వ్యక్తి రోడ్లు ఎంత దారుణం ఉ‍న్నాయో అధికారులకు తెలియజేసేలా అతను బురద నీటితో స్నానం చేయడమే కాకుండా ఆ బురద నీటిలోనే యోగాసనాలు వేశాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో చోటు చేసుకుంది. ఈ నిరసనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అదే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే లతిఫ్‌ రావడం, చూడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడకుండా తన కారుని ఆ వ్యక్తి నుంచి తప్పించి వెళ్లిపోతున్నారు. 
 
అయినా సరే సదరు వ్యక్తి వదలకుండా ఆయన కారు వెళ్తున్న దారి వైపుగా ఉన్న గుంతల రోడ్డుకి అడ్డుపడుతూ.. ఆ బురద నీటిలోనే యోగా భంగిమలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈ గుంతల రోడ్డు కారణంగానే ఇటీవలే ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద 52 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడుని ట్రక్‌ ఢీ కొని చనిపోయాడు.
 
దీంతో సదరు హంజా పోరాలి అధికారులు స్పదించే విధంగా ఈ వింత నిరసనను చేపట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో కేరళ హైకోర్టు వెంటనే ఈ విషయమై స్పందించి.... సుమోటోగా ఈ కేసును పరిగణలోని తీసుకుంది. తక్షణమే గుంతలను పూడ్చాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని కోరింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments