Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చోరీ చేశాడన్న అనుమానంతో విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు...

deadbody
, బుధవారం, 27 జులై 2022 (08:32 IST)
తమ వాచ్‌ను చోరీ చేశాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని కొందరు విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దిల్షన్ అలియాస్ రాజా అనే 15 యేళ్ల బాలుడు ఈ నెల 23వ తేదీ ఇంటర్ అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుంచి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఇంతలో ఆ కాలేజీలో పని చేసే శివకుమార్ యాదవ్ అనే ఉపాధ్యాయుడి వాచ్ కనిపించలేదు. ఈ వాచీని రాజానే దొంగిలించివుంటాని బలంగా నమ్మాడు. ఆ తర్వాత రాజాను కాలేజీకి పిలిపించి, సహ ఉపాధ్యాయులు ప్రభాకర్, వివికే యాదవ్‌లతో కలిసి శివకుమార్ యాదవ్ తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన రాజా అక్కడే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని హుటాహుటిన కాన్పూరు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నిర్మలరావు నియమితులయ్యారు