Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామిడి కాయ కావాలని మారాం చేసిన మేనకోడలి హత్య.. ఎక్కడ?

murder
, ఆదివారం, 24 జులై 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేశాడో ఓ కిరాతకుడు. ఈ కిరాతకుడు అన్నం తింటుండగా వచ్చి మామిడికాయ కావాలంటూ పదేపదే కోరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కిరాతకుడు ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి చంపేశాడు. దీంతో ఐదేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఈ దారుణం జరిగింది. 33 యేళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు వరుస అయ్యే ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అడిగింది. దీంతో తీవ్ర అసహనానికి లోనై ఉమర్దీన్ ఓ రాడ్‌ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఉమర్దీన్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరవేగంగా మంకీపాక్స్ కేసులు - అత్యయిక పరిస్థితి