Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళపై సామూహిక అత్యాచారం.. అది కూడా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో?

New Delhi Railway Station
, శనివారం, 23 జులై 2022 (16:28 IST)
New Delhi Railway Station
దేశంలో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్‌.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. 
 
దీంతో ఆమె కీర్తి నగర్ మెట్రో స్టేషన్‌లో సతీష్‌ను కలుసుకుంది.  సతీష్‌ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
 
కాగా, బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫోనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మించి గర్భవతిని చేసాడు, నాకీ గర్భం వద్దంటూ కోర్టుకెక్కిన బాలిక