Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తోపుడు బండి వస్త్ర వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు.. ఎక్కడ?

cloth vendor
, బుధవారం, 20 జులై 2022 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండిపై వస్త్రాలు అమ్ముకుంటూ పొట్టపోసుకునే ఓ చిరు వ్యాపారికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. వారిద్దరూ తుపాకీలు చేతబట్టి ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఆయన వీధి వీధి తిరుగుతూ వస్త్రాల విక్రయిస్తుంటే ఆ సాయుధ బాడీగార్డులు ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఎటా జిల్లా చెందిన రామేశ్వర్‌ దయాల్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుగేంద్ర నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
మరోవైపు, తనకు పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ బస్సుకు పేరు పెట్టండి... బహుమతి గెలుచుకోండి..