Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండోచైనా సరిహద్దుల్లో 19 మంది కూలీల మిస్సింగ్

indochina border
, మంగళవారం, 19 జులై 2022 (12:21 IST)
భారత్, చైనా దేశాల సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యమయ్యారు. వారికోసం భారత సైన్యం ముమ్మరంగా గాలిస్తుంది. వీరంతా ఇరు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్నారు. వీరి ఆచూకీ గత రెండు వారాలుగా తెలియరావడం లేదు. 
 
అయితే, వీరిలో ఒకరి మృతదేహం సమీపంలోని నదిలో లభ్యమైనట్లు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారిక సమాచారం. దీంతో అదృశ్యమైన కూలీల కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. 
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల కురుంగ్‌ కుమే జిల్లాలోని దమిన్‌ సర్కిల్‌లో సరిహద్దు రహదారుల సంస్థ (బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ - బీఆర్‌ఓ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ పనిచేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ 19 మంది కూలీలను అస్సాం నుంచి తీసుకొచ్చారు. 
 
బక్రీద్‌ పండగ నిమిత్తం వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెలవు అడగ్గా.. కాంట్రాక్టర్‌ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన ఈ కూలీలంతా తమ శిబిరాల నుంచి పారిపోయారు. నాటి నుంచి వీరు కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది.
 
వీరంతా కన్పించకుండాపోయినట్లు జులై 13న స్థానిక పోలీసుస్టేషన్‌లో కాంట్రాక్టర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. నిర్మాణ సైట్‌ నుంచి వీరంతా అడవి మార్గంలో కాలినడకన వెళ్లి ఉంటారని, ఆ క్రమంలో దారితప్పి అడవిలో అదృశ్యమై ఉంటారని పోలీసులు భావించారు. 
 
దమిన్‌ ప్రాంతంలోని కుమే నదిలో ఇటీవల ఓ మృతదేహం లభ్యమైంది. అది అదృశ్యమైన కూలీల్లో ఒకరిదంటూ సోషల్‌మీడియా, స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ పరీక్ష.. లో-దుస్తులను విప్పించి.. పరీక్షా గదికి..?