Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి.. ఫోన్ చూస్తూ వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏమైంది?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:57 IST)
మద్యం సేవించేందుకు మిద్దెపైకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భరత్‌పూర్ జిల్లాలో బయానా పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబా టాకీస్ దగ్గర హరిజన బస్తీ ఉంది. సోమవారం సాయంత్రం ఆ బస్తీలో ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయనకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. 
 
తన వెనుక ఏదో పడినట్టు శబ్ధం వచ్చి వెనక్కి తిరిగాడు. అంతే అక్కడ పడింది చూసి ఖంగుతిన్నాడు. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కింద పడ్డాడు. కిందపడిన వ్యక్తి పేరు సురేష్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది.
 
సోమవారం సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగొచ్చాకా.. మద్యం సేవించాలని సురేష్ మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తల నేరుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్ కిందపడిన సంఘటన మొత్తం అతడి ఇంటిపక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments