Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి.. ఫోన్ చూస్తూ వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏమైంది?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:57 IST)
మద్యం సేవించేందుకు మిద్దెపైకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భరత్‌పూర్ జిల్లాలో బయానా పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబా టాకీస్ దగ్గర హరిజన బస్తీ ఉంది. సోమవారం సాయంత్రం ఆ బస్తీలో ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయనకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. 
 
తన వెనుక ఏదో పడినట్టు శబ్ధం వచ్చి వెనక్కి తిరిగాడు. అంతే అక్కడ పడింది చూసి ఖంగుతిన్నాడు. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కింద పడ్డాడు. కిందపడిన వ్యక్తి పేరు సురేష్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది.
 
సోమవారం సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగొచ్చాకా.. మద్యం సేవించాలని సురేష్ మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తల నేరుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్ కిందపడిన సంఘటన మొత్తం అతడి ఇంటిపక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments