Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:28 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన చేసింది. ఈ మీడియా బుల్లిటెన్ మేరకు మంగళవారం నాడు 10,197 కేసులు నమోదుకాగా, గత 24 గంటల్లో ఆ కేసుల సంఖ్య 12 వేలకు చేరువైంది. ఈ కేసుల క్రితం రోజుతో పోల్చితే 15 శాతం అధికం కావడం గమనార్హం. 
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,919 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,78,517కు చేరాయి. ఇందులో 3,38,85,132 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 
 
అదేవిధంగా 1,28,762 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,64,623 మంది మృతిచెందారు. కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకువ 11,242 మంది కరోనా నుంచి బయటపడగా, 470 మంది మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.37 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ఠమని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments