Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:25 IST)
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనారోగ్య సమస్యల కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత ఏడు నెలలుగా ఐసియులో ఉన్నారని ఆమె కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె వయసు 84. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
Yamini Krishnamurthy
ముంగర యామిని కృష్ణమూర్తి డిసెంబర్ 20, 1940న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆమె భటనాట్యం  కూచిపూడి స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్‌లో నిష్ణాతురాలు. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినప్పటికీ, ఆమె తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. ఆమె తొలి ప్రదర్శన 1957లో మద్రాసులో జరిగింది. 
 
ఈమె కూచిపూడి నాట్య టార్చ్ బేరర్‌గా మాత్రమే కాకుండా టీటీడీ ఆస్థాన నర్తకి కూడా. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో రాణించిన ఆమె పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అత్యున్నత పౌర పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
 
ఆమె గొప్ప ప్రతిభను గుర్తించి సాంబవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆమెను నాట్య శాస్త్ర అవార్డుతో సత్కరించింది. ఆమె న్యూ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి యువ డ్యాన్సర్‌లకు పాఠాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments