Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ గాంధీకి కరోనా పాజిటివ్ - ఎన్నికల ప్రచారానికి బ్రేక్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (14:36 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన యువ నేత వరుణ్ గాంధీకి కరోనా వైరస్ సోకింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయన ఫిలిబిత్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనాబారినపడ్డారు. తనకు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని, స్వయంగా వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  కూడా సాగుతోంది. అందువల్ల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలకు ఎన్నికల సంఘం ముందుగా వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఈ కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 కేసులు నమోదుకాగా, తర్వాత స్థాంలో ఢిల్లీ 513 కేసులతో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో 123 ఒమిక్రాన్ కేసులు ఉండగా, కర్నాటకలో 441, రాజస్థాన్ రాష్ట్రంలో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి 40,863 మంది కోలుకున్నారు. ఈ కొత్త కేసులతో కలుపుకంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,53,603కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments