Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ సమయంలోనైనా ఎన్నిక‌లు రావచ్చు... ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు జోస్యం

ఏ సమయంలోనైనా ఎన్నిక‌లు రావచ్చు... ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు జోస్యం
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:55 IST)
ఏపీలో ఏ స‌మ‌యంలో అయినా ఎన్నిక‌లు రావ‌చ్చ‌ని ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు జోస్యం చెప్పారు. అందుకు టీడీపీ క్యాడ‌ర్ ఇప్ప‌టి నుంచే సిద్ధంగా ఉండాల‌న్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించినా, ప్ర‌తిప‌క్షంగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారని ఎంపీ రామ్మోన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
 
అందరూ సిద్దంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలన్నారు. తెలుగు దేశం జండా చూస్తే, వైఎస్సార్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలన్నారు. మనం భయపడే రోజులు పోయాయని, జగన్మోహన్ రెడ్డి భయపడే రోజులు వచ్చాయన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారంద‌రికీ తాను అండగా ఉంటానని రామ్మోన్ నాయుడు హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. బీచ్ రోడ్‌ మూసివేత