Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:11 IST)
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ నగర్ - ముంబైల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందుభాగంలో అమర్చిన డోమ్‌కు అమర్చిన  మెటల్ ప్లేట్ ఒకటి ఊడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు 
 
ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డురాగా, వాటిని గమనించిన లోకో పైలెట్ షడన్ బ్రేక్ వేశారు. అయినప్పటికీ ఓ గేదెను రైలు ఢీకొట్టింది. 
 
దీంతో రైలు ముందు భాగంలోని డోమ్‌కు ఉన్న ఒక మెటల్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంపై విపక్షాల నేతలు సెటైర్లు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఈ ప్రమాదంపై భారత రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని, ప్రమాదం జరిగిన 8 నిమిషాల్లోనే రైలు బయలుదేరి గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments