Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:53 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి 12 -14 సంవత్సరాల వయుస్సున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా పెద్దలకు తొలుత కరోనా టీకాలు వేశారు. ఆ తర్వాత 15 -18 యేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 యేళ్లు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 12-14 యేళ్ల మధ్య పిల్లలతో పాటు 60 యేళ్ళకు పైబడిన వాళ్ళకి ప్రికాషన్ డోసు ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 1,79,91,57,4876 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments