Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 వేలకు దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు - 104 మంది మృతి

5 వేలకు దిగువకు చేరుకున్న పాజిటివ్ కేసులు - 104 మంది మృతి
, గురువారం, 10 మార్చి 2022 (11:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేలకు దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4184 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 104 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,15,459 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,79,5395,649 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్