Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో వరదల్లో కొట్టుకునిపోయిన కారు - 9 మంది జలసమాధి

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (15:21 IST)
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరభారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా రామ్‌నగర్‌లో దెల్హా నది పొంగిపొర్లడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది జలసమాధి అయ్యారు. మరో ఐదుగురు వరదలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒక బాలికను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
అలాగే మహారాష్ట్ర, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. దీంతో గోవా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావొవద్దని హెచ్చరించింది. 
 
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడొచ్చనే సూచనలతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మశోబరా ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో మొత్తం బురదమయంగా మారిపోయింది. అస్సాంలో వరదలు కొంతమేరకు శాంతించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments