Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజ్ పిజ్జా డెలివరీ చేస్తే అది ఇచ్చారనీ రూ.కోటికి దావా వేసిన మహిళ

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (14:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెరికాకు చెందిన రెస్టారెంట్‌ ఔట్‌లెట్‌పై కోటి రూపాయల నష్టపరిహారానికి దావా వేసింది. పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్‌ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారన్న ఆమె ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ 2019, మార్చి 21న సదరు ఔట్‌లెట్‌ నుంచి శాకాహార పిజ్జాను ఆర్డర్‌ చేసింది. అయితే ‘‘చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాను ఇవ్వడంతో రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహార పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే... సదరు ఔట్‌లెట్‌ మేనేజర్‌ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు అని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments