Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజ్ పిజ్జా డెలివరీ చేస్తే అది ఇచ్చారనీ రూ.కోటికి దావా వేసిన మహిళ

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (14:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెరికాకు చెందిన రెస్టారెంట్‌ ఔట్‌లెట్‌పై కోటి రూపాయల నష్టపరిహారానికి దావా వేసింది. పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్‌ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారన్న ఆమె ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ 2019, మార్చి 21న సదరు ఔట్‌లెట్‌ నుంచి శాకాహార పిజ్జాను ఆర్డర్‌ చేసింది. అయితే ‘‘చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాను ఇవ్వడంతో రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహార పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే... సదరు ఔట్‌లెట్‌ మేనేజర్‌ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు అని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments