కరోనా లాక్డౌన్ కేసులన్నీ ఉపసంహరణ.. సీఎం యోగి నిర్ణయం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:12 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. అయినప్పటికీ అనేక మంది ఈ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారు. ఇలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇపుడు ఈ కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్యులపై గతంలో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఉపశమనం కలగనుంది. 
 
సీఎ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారులపై వేసిన ‘ఉల్లంఘన’ కేసులను ఇటీవలే వెనక్కి తీసుకున్నారు. 
 
ఇప్పుడు సాధారణ ప్రజానీకంపై వేసిన కేసులు ఉపసంహరించనున్నారు. కాగా దేశంలో తొలిసారిగా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులను వెనక్కి తీసుకున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments