Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్డౌన్ కేసులన్నీ ఉపసంహరణ.. సీఎం యోగి నిర్ణయం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:12 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. అయినప్పటికీ అనేక మంది ఈ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారు. ఇలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇపుడు ఈ కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్యులపై గతంలో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఉపశమనం కలగనుంది. 
 
సీఎ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారులపై వేసిన ‘ఉల్లంఘన’ కేసులను ఇటీవలే వెనక్కి తీసుకున్నారు. 
 
ఇప్పుడు సాధారణ ప్రజానీకంపై వేసిన కేసులు ఉపసంహరించనున్నారు. కాగా దేశంలో తొలిసారిగా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులను వెనక్కి తీసుకున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments