Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండో దశ ఎన్నికల పోలింగ్ : యూపీలో 55 సీట్లకు పోలింగ్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:57 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ జరుగుతోంది ఇందులోభాగంగా, అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలలో అధికార బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కమలనాథుల్లో ఆందోళన నెలకొంది. పైగా, ఈ స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. 
 
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ముఖ్య నేతల్లో గత 1989 నుంచి షాజన్‌పూర్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న బీజేపీ సీనియర్ నేత సురేష్ ఖన్నా తొమ్మిదో సారి కూడా విజయకేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. 
 
అలాగే, రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం రాంపూర్ లోక్‌సభ సభ్యుడుగా ఉన్న అజంఖాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రెహా, ఛమ్రువా, నగినా వంటి స్థానాల్లో ముస్లిం ఓటర్లను అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 
 
అయితే, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 55 సీట్లలో బీజేపీ 38, ఎస్పీ 15 స్థానాల్లో గెలుపొందాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కానీ, ఈ దఫా పరిస్థితి తారుమారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments