Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ దళిత యువకుడి సజీవ దహనం

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (10:11 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ ఓ దళిత యువకుడుని సజీవ దహనం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన కన్నతల్లి... బిడ్డతో పాటు తుదిశ్వాస విడిచింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్దోయి జిల్లాలోని బదేస గ్రామానికి చెందిన యువకుడు అభిషేక్ అదే గ్రామానికే చెందిన ఓ అగ్రకుల యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ప్రియురాలిని కలిసి తన ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని చూసిన కొందరు గ్రామస్థులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. 
 
ఈ విషయాన్ని గుర్తించిన మరికొందరు స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments