Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మాటలు చెబుతున్నాడనీ తండ్రిపై కత్తితో కొడుకు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:00 IST)
చెడు తిరుగుళ్లు తిరగకుండా సత్ మార్గంలో నడుచుకోవాలంటూ నాలుగు మంచి మాటలు చెప్పిన తండ్రిపై ఓ కుమారుడు పైశాచికంగా దాడిచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జమునానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జులాయ్‌గా తిరుగుతుండేవాడు. పైగా, కేంద్రం నిషేధించిన పబ్‌జీని గంటల కొద్దీ ఆడుతూ వుండేవాడు. దీన్ని గమనించిన తండ్రి... అన్ని గంటలు పబ్‌జీ ఆడకురా అని కుమారుడికి మంచి చెప్పాడు. ఇదే ఆ తండ్రి చేసిన పాపం. 
 
అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కొడుకు.. నన్నే ఆడుకోవద్దంటావా అంటూ ఉన్మాదిగా మారి తండ్రిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆయన గొంతు కోసేశాడు. తండ్రి రక్తంతో తడిసిన దుస్తులతో అలాగే వడివడిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు.
 
అంతటితో ఆగక.. తనకు ఎదురుపడిన వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో ఉన్న అతడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి కొడుకులిద్దరూ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments