Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నా.. బ్రెయిన్ డ్యామేజ్ తప్పదట... (Video)

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:17 IST)
కరోనా సోకడం.. ఆపై ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా కొన్ని అనారోగ్య సమస్యలు తప్పట్లేదనే విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌కు సంబంధించిన తొలి కేసు ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో నమోదైంది. కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించింది.
 
కాగా.. చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసు పూర్తి వివరాలను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా బారిన పడ్డ 11 ఏళ్ల బాలికలో వైరస్ కారణంగా కలిగిన ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్(ఏడీఎస్) వ్యాధిని గుర్తించామని చెప్పారు. ఈ వయసు పిల్లల్లో ఇటువంటి వ్యాధి రావడం ఇదే తొలిసారి అని అక్కడి డాక్టర్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుంది. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో ముఖ్యం. అయితే వైరస్ కారణంగా..ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో బాలిక చూపు మందగించింది.
 
కాగా.. డా. గులాటీ సారథ్యంలోని వైద్యం బృందం ఆమెకు చికిత్సను అందించింది. ఆమె కంటిచూపు మునుపటితో పోలిస్తే 50 శాతం మెరుగవడంతో డాక్టర్లు ఆమెను ఇటీవలే డిశార్జ్ చేశారు. ఏడీఎస్ కారణంగా కంటిచూపుతో పాటూ కండరాల కదలికలు, ఇతర ఇంద్రియాలు, మూత్రాశయం, వంటివి ప్రభావితమవుతాయని డాక్టర్లు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments