Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ తగ్గుముఖం.. నలభై వేలకు పడిపోయిన కేసులు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:07 IST)
భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకి సగటున 90 వేల కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య నలభై వేలకు పడిపోయింది. సోమవారం రోజున కొత్తగా 46,791కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 587 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. సోమవారం ఒక్కరేజే 69,721మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 67,33,329మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,15,197 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,48,538 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది. 
 
దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,32,795 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 9,61,16,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments