Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు వేగం గంటకు సగటున 220 కిమీ...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (10:21 IST)
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెమీ హై స్పీడ్ రైళ్ళుగా భావించే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అయితే, వచ్చే రెండేళ్ళలో వందే భారత్ రైళ్ళలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను హై స్పీడ్ రైళ్ళ కేటగిరీ వేగాన్ని అందుకునే దిశగా మార్పులు చేయనున్నారు. 
 
ఈ మేరకు చెన్నైలోని ఐసీఎఫ్‌ నిపుణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న వందేభారత్‌ రైల్వే కోచ్‌ల సామర్థాన్నిపెంచేందుకు అవసరమైన సాంకేతికతపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు ట్రాక్‌ సామర్థ్యాన్ని బట్టి గంటకు 60 నుంచి 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. రానున్న రోజుల్లో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా.. వందేభారత్‌ రైళ్ల వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో ప్రణాళికలు రచిస్తున్నారు. 
 
భవిష్యత్తులో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 200 నుంచి 220 కి.మీ.కు పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డుతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ వేగాన్ని అందుకోవాలంటే వందేభారత్‌ రైళ్లలో సామగ్రిపరంగా మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ రైళ్లకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లోహాన్ని వాడుతున్నారు. హైస్పీడ్‌ వేగాన్ని అందుకోవాలంటే అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చడానికి, ప్రొటోటైప్‌ రైలు సిద్ధమవడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఈ వేగంతో రైళ్లను పరుగులు పెట్టించే అవకాశాలున్నాయి. దీనికి తగ్గట్లు సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ సాంకేతిక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో గంటకి 245 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యంతో వందేభారత్‌ డిజైనింగ్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. కానీ పట్టాలపై మాత్రం దీని అత్యధిక వేగం గంటకు 220 కి.మీ.కు మించకుండా చేసే అవకాశముందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments