Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డుకూర వండలేదని గన్‌తో భార్యను కాల్చేసిన భర్త

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దే

Webdunia
శనివారం, 14 జులై 2018 (14:58 IST)
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల నవనీత్-మంగేశ్ శుక్లాకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
అయితే నవనీత్ తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం తప్పతాగి ఇంటికొచ్చాడు. కోడిగుడ్డు కూర వండాలని భార్యకు చెప్పాడు. కానీ కోడిగుడ్డుకూర వండేందుకు భార్య నిరాకరించడంతో నవనీత్‌ కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న నవనీత్ ఇంట్లోకి వెళ్లి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో గాయపడిన శుక్లాను స్థానికులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై శుక్లా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments